మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందు ఎంపీడీవో అప్పారావు ఎంపిఓ అరుణ్ గౌడ్ ఆదేశానుసారం ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ అధ్యక్షతన పాలకవర్గ సమావేశంలో ఎంపీటీసీ పర్యవేక్షణలో శ్రమదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కారు మబ్బులు కమ్మేసి వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామపంచాయతీ ప్రజలు ఎంతో ఉత్సాహంగా శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శేషగిరి, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పేస సభ్యులు, కో- ఆప్షన్ సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: