మన్యం టీవీ అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం అమెర్థ కాలనీకి చెందిన మోత్కూరు.రోజా అనారోగ్య సమస్యతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు.రెక్కాడితే కానీ డోక్కడాని పరిస్థితి ఆమెది.ఈ విషయం తెలుసుకున్న *జనం కోసం మనం స్వచ్చంద సంస్థ* వారు ముందుకు వచ్చి 25 కేజిల బియ్యం, కురగాయలు,నిత్యావసర సరుకులు పంపిణీ చేయ్యడం జరిగింది.సంస్థ ఫౌండర్ గూడూరు.కృష్ణా రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహిన వర్గాలకు,పేదలకు పూర్తి సహాయసహకారాలు అందించుటకు జనం కోసం మనం స్వచ్చంద సంస్థ ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని, అందులో భాగంగా శనివారం మోత్కూరు రోజాకు సహాయసహకారాలు అందించడం జరిగిందన్నారు.ఈ సహాయాన్ని జనతా టీం వారు సహకారం తో అందిచారు.ఈ కార్యక్రమం లో సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణా రెడ్డి,పునాటి. పాపయ్య,నజీర్ షోను, మోదుగు వంశీ,కాలవ సురేష్,రఘు,కార్తీక్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: