మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం కాలనీ ఫామాయిల్ తోటలను సందర్శించడానికి విచ్చేసినా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా (ఐఏఎస్) మరియు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ (ఐఎఎస్), ఐటిడిఎ పిఓ గౌతమ్ (ఐఎఎస్), జేసి వెంకటేశ్వర్లు, ఏంఎల్ఎ మెచ్చా నాగేశ్వరావు మరియు మండల నాయుకులు నారంవారిగూడెం కాలినీ పంచాయితీ లో అవిన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటి 4వ విడత పల్లెప్రగతి మొదటి రోజు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీలు వరలక్ష్మి, పైడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ శ్రీరామూర్తి, ఎంపీడీఓ విజయ, ఎంపిఓ సీతారామరాజు, సర్పంచ్ నారం రాధ, స్పెషల్ ఆఫిసర్ సౌజన్య, కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఆ గ్రామ వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: