అభినందించిన పాఠశాల యాజమాన్యం
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన పండ్రమీషు శంకరయ్య- పుల్లమ్మ ల సంతానం అయిన పండ్రమీషు గణేష్ ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లోని ఎక్సెలెంట్ భాషా హై స్కూల్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాలలో మంచి గ్రేడ్ పాయింట్లు సాధించి ఉత్తీర్ణుడు అయినాడు. ఇదే తరహాలో ఇటీవల నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో తన ప్రతిభను కనబరిచి ఏడూళ్ల బయ్యారం ఎక్సలెంట్ భాషా హై స్కూల్ స్థానాన్ని ఓ మెట్టు ఎక్కించాడు. ఇంజనీరింగ్ విభాగంలో 897 ర్యాంకు , అగ్రికల్చర్ విభాగంలో 2132 ర్యాంకు సాధించి విజేతగా నిలిచాడు. కరోనా సమయంలో కూడా కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించినందుకు పాఠశాల యాజమాన్యం గణేష్ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విజయోత్సవం సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్లు ఖాదర్, గబ్బర్, వెంకట నర్సారెడ్డి, నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ లు అభినందించారు .
Post A Comment: