బాలుడి మృతి తో కదిలిన యంత్రాంగం
గుండాల జూలై 28 (మన్యం మనుగడ) కిన్నెరసాని వాగులో మంగళవారం ప్రమాదవశాత్తు బాలుడు రెహాన్ చనిపోవడంతో తక్షణమే స్పందించిన రెవిన్యూ మరియు పంచాయతీ సిబ్బంది ప్రమాద స్థలం వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బాలుడు మృతిచెందడంతో ఉన్నతాధికారులు ఆదేశించడంతో స్థానిక యంత్రాంగం వాగు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు. దీనితోపాటు ఇతర ప్రమాద స్థానాలలో కూడా ఏర్పాటు చేసినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడుకొని గూడెం సర్పంచ్ జయసుధ, సెక్రటరీ రామ్మోహన్ , పడుకొని గూడెం సెక్రటరీ అకుల్, ఆర్ఐ నాగేశ్వరరావు, వీఆర్ఏ శివాజీ, లక్ష్మణ్ , గ్రామస్తులు శోభన్ బాబు, బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: