మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మ గారి పల్లి గ్రామ రైతులు మెరుగైన పరిహారం కొరకు గురువారం రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములను ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సీతమ్మధార ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు తీసుకోవాల్సి ఉండగా నామ మాత్రపు ప్యాకేజీ పరకటించడం సరి కాదన్నారు. ప్రభుత్వం సరైన ప్యాకేజీ ప్రతి ఎకరాకు 25 లక్షలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పిస్తే నే మా భూములు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు రెండు పంటలు పండే మా భూములను ఇచ్చే ప్రసక్తి లేదని ,ఉన్న భూములు కోల్పోయి దిక్కు లేని వారు అయ్యామని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఈసారైనా మాకు తగు న్యాయం జరిపించ గలరని కోరారు.ఇకనైనా ప్రభుత్వం తమకు న్యాయం జరిగే వరకూ ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టిన రైతులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు కోనేరు చిన్ని ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముస్కూ, శ్రీనివాసరెడ్డి ,తాటిపాముల ఐలయ్య, లింగారెడ్డి,.రైతులకు మద్దతు తెలిపారు, ఈ కార్యక్రమంలో నాగార్జున, నరసింహాచారి,దాసరి శ్రీను ,దాసరి నాగేశ్వరరావు నేలపట్ల జోగి రెడ్
Post A Comment: