👉 ఎక్స్గ్రేషియా చెల్లించాలి
మన్యం మనుగడ, మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట వాసి సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు కుంట వెంకన్న భార్య కుంటలక్ష్మి (43) కరోనా సోకి మృతి చెందిందని భర్త వెంకన్న తెలిపారు, గత 15 రోజుల క్రితం అస్వస్థకు గురైన లక్ష్మినీ భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో చేర్చామని శ్వాస సమస్యలు తీవ్రం కావడంతో అక్కడి నుండి ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల చేర్చామని అక్కడ చికిత్స పొందుతూనే గురువారం ఉదయం చనిపోయిందని ఆయన తెలిపారు, కాగా వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఇందులో ఒక పాప చెవిటి మూగ ఒక అమ్మాయికి వివాహం చేశామన్నారు
సమా చారం తెలుసుకున్న స్థానిక ఐ.ఎఫ్.టి.యు నాయకులు SD నా సర్ పా షా, ఏమంగీలాల్ రాజు పేట చేరుకుని లక్ష్మీ మృతికి సంతాపం తెలిపారు, లక్ష్మీ భౌతికకాయానికి భౌతిక దూరం పాటించి నివాళులర్పించారు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు కరోనా తో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తామన్న ఎక్స్గ్రేషియా తోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు బంధువులు మిత్రులు, కన్నెగంటి వేణు, నజీర్, నరేష్ ,యోహాను, శీను, రాజు ,మురళి, అక్బర్,కె రవి ,కే గురుమూర్తి ,ఏం మురళి ఆర్ వెంకన్న , గోపి నాగరాజు, ఉప్పలయ్య,శేషగిరిరావు వెంకటేశ్వర్లు,భారతమ్మ ,ప్రభావతి ,భాగ్యమ్మ , గోపయ్య ,రవికుమార్ ఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: