కిన్నెరసాని వాగు దాటి వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ సంధ్యా రాణి
మండలంలో అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్
గుండాల /ఆళ్ల పల్లి జూలై 20 (మన్యం మనుగడ) వాగులు దాటి వైద్య సేవలు అందిస్తున్న ఆళ్ల పల్లి ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు సంధ్యారాణి. కిన్నెరసాని అవతల ఒడ్డున ఉన్న రాయి గూడెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు కిన్నెరసాని వాగును కష్టం మీద నైన దాటి శిబిరం నిర్వహించారు . గ్రామంలో పారిశుద్ధ్య సమస్య పై గ్రామస్తులకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో మురుగునీరు ఉండకుండా చూసుకోవాలన్నారు పత టైర్లలో కూలర్ల లో మరియు వాడకం లేని డ్రమ్ములు మరియు గోలేంలో నీళ్లు నిలవకుండా చూడాలన్నారు. దానితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. కాచి వడగట్టి న నీరు త్రాగటం వలన రోగాల బారిన పడకుండా ఉండవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు
Post A Comment: