CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటుకున్న బట్టా మల్లయ్య ట్రస్ట్ సభ్యులు -జోరు వానలో కరోనా మృతురాలికీ దహనసంస్కారాలు నిర్వహణ -అభినందిస్తున్న మండల ప్రజలు

Share it:


  మన్యం టీవీ,బూర్గంపాడు :      వర్షం సైతం లెక్కచేయకుండా కరోనా మృతురాలికి బట్టా మల్లయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు,మాజీ జెడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ,ట్రస్ట్ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు విజయ్ గాంధీ మాట్లాడుతూ.. కృష్ణసాగర్ ఎస్సీ కాలనీకి చెందిన పోతుల కోటమ్మ కరోనా తో మృతి చెందారు. మృతురాలి కుమారుడు వికలాంగుడు కావడంతో అంత్యక్రియలు జోరు వానలో నిర్వహించెందుకు వీలు కాకపోవడం,ఎవరు ముందు రావడం లేదని ఈ విషయం ట్రస్ట్ దృష్టి కి తీసుకు రావడంతో ట్రస్ట్ సభ్యులు చేరుకుని దహన సంస్కారాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జోరు వానలో సైతం కరోనా మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ట్రస్ట్ సభ్యులను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తాటి సత్యనారాయణ, బొగ్గం కృష్ణ,ఇర్పావెంకటేష్,బోజ్జి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: