మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ రాజుపేట లో సింగరేణి ప్రభావంతో నెలకొన్న పలు సమస్యల తో వారం క్రితం యువత ధర్నా చేయడంతో అధికారులు వారిని విధుల నుండి తప్పించడం జరిగింది.వారు ఆ విషయాన్ని పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సాగర్ యాదవ్ కు తెలియజేయడం తో ఆయన ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ లలిత్ కుమార్ లతో కలిసి మాట్లాడుతూ,వారిని తక్షణమే విధులకు తీసుకోవాలని,రాజుపేట పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని,ప్రతి నెల సింగరేణి ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.ప్రైవేట్ కంపెనీల లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ,వాల్వో డ్రైవింగ్, లైసెన్స్ ఇచ్చే విధంగా, మహిళలకు చేతి వృత్తుల శిక్షణ లు సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వాలని కోరడం ఈ సందర్భంగా కోరడం జరిగింది.సమస్యల పై సింగరేణి అధికారులు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు గుర్రం సృజన్,బానోత్ రమేష్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: