👉గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ దగ్గరుండి వంతెన ఏర్పాటు
👉ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు
గుండాల జూలై 14 (మన్యం మనుగడ) కిన్నెరసాని వాగుపై తాత్కాలిక వంతెనను వంతెనను గుండాల పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఉన్నత అధికారుల సూచనతో సీఐ శ్రీనివాస్ చొరవతో గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ ఉదయం నుండి ఈ వంతెన పనిలో నిమగ్నమయి పూర్తి చేయించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు వాగు ఉప్పొంగి నప్పుడల్లా కర్రల వంతెన ను ఏర్పాటు చేసుకొని దానిమీద నుండి ప్రమాదమని తెలిసినా దాటాల్సి నా పరిస్థితి నెల కొనేది. పత్రికల్లో కర్రల వంతెన కథనం ప్రచురణ కావడంతో స్పందించిన పోలీస్ శాఖ తాత్కాలిక వంతెనను పకడ్బందీగా ఏర్పాటు చేసింది. గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ గిరిజనులతో కలిసి సిబ్బందితో వంతెనపై అటుఇటు నడిచి వంతెన సామర్థ్యాన్ని పరిశీలించారు. తాత్కాలిక వంతెనను ఏర్పాటుచేసిన పోలీస్ శాఖకు మరియు గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ వంతెన వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో రెవిన్యూ సిబ్బంది మూడు షిఫ్టు ల వారిగా విధులు నిర్వహిస్తున్నారు
Post A Comment: