మన్యం టీవీ మంగపేట.
మంగపేట:- రాజుపేట నుంచి చుంచుపల్లి వరకూ రాజుపేట మండల కేంద్రం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీ,ఏ,జీ,ఎస్ నాయకులు కొమరం సందీప్ కుమార్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజుపేట చుట్టుపక్కల 10 గ్రామపంచాయతీ దాకా ఉన్నాయి అని రాజుపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మంగపేట కి వెళ్లడానికి చార్జీలు కూడా అధికంగా ఇలా పెరగటం వలన చార్జీల భారం అవుతుందని పేద మధ్య తరగతి కుటుంబాల్లో మంగపేట వెళ్ళటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రాజుపేట ను మండల కేంద్రం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల టీ,ఏ,జీ,ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో
ప్రజా సంఘ నాయకులు
రవి, సుధాకర్,నాగభూషణం, నాగరాజు, శ్రీను, రఘు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: