మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన సందర్భంగా ఎంపీటీసీ వేముల భారతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ వేముల భారతి, అల్లిగూడెం సర్పంచ్ కృష్ణవేణి కేకు కట్చేసి అందరికీ స్వీట్లు పంచారు. అనంతరం నిరుపేదలకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అమ్మ సేవదనం (వృద్ధాశ్రమం) లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వేముల భారతి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అంటూ చాటిచెప్పిన మదర్ తెరిసా యుద్ధం అంటేనే ధైర్యసాహసాలతో ముందడుగు పోరాట పటిమ గల నేటితరం ఝాన్సీ లక్ష్మీబాయి సీతక్క అని, ఎన్నో సేవా కార్యక్రమాలతో అలుపెరుగని పోరాట పటిమ గల వీరవనిత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతక్కకి జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా నాయకులు తుమ్మ రాంబాబు, ఎంపీటీసీలు సత్యవరపు తిరుమల బాలయ్య, మిండ హరిబాబు మరియు ముళ్ల గిరి కృష్ణ, వేముల ప్రతాప్, వగ్గెల పూజ, బండారు మహేష్, ధార రవి, యమ్ వెంకన్న మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: