మన్యం టీవీ మంగపేట.
తొండ్యాల లక్ష్మిపురం గ్రామానికి చెందిన పొదేం నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన పాడి ఆవు ట్రాన్స్
పార్మర్ దగ్గర కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది. గతం లో మే 12 వ తేదీన రెండు ఆవులు చనిపోయాయి. మే17 వ తేదీన మూడు ఆవులకు కరెంటు తగలగా స్థానికంగా ఉన్న వాళ్ళు ఎల్ సి తీసుకోవడం తో ప్రమాదం తప్పింది. గతంలో చనిపోయిన ఆవుల లో పొదెం నాగేశ్వరరావు దూడ కూడ ఉంది. ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదం జరిగింది. ఈ విషయం పై పలుమార్లు చెప్పిన విద్యుత్ శాఖ వారు స్పందించడం లేదని, ట్రాన్స్ఫార్మర్ ను ఇక్కడి నుండి తీసివేసి బాధిత రైతుకు ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతు,గ్రామస్తులు కోరారు.
Post A Comment: