🔥టిఆర్ఎస్ పార్టీ మణుగూరు టౌన్ అధ్యక్షులు రుద్ర వెంకట్
మన్యం మనుగడ, మణుగూరు:
మణుగూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాస్తవ ప్రకటనలు మానుకోవాలని మణుగూరు టౌన్ అధ్యక్షులు రుద్ర వెంకట్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం శివ లింగ పురం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ చెందిన కొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అని అవాస్తవ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వర్గ పోరు లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు మతిభ్రమించి మాట్లాడం హాస్యాస్పదం అన్నారు.పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరు అన్ని విధాల అభివృద్ధి చెందుతుందనిరేగా కి ప్రజలు, యూత్ సంపూర్ణ మద్దతు ఉందని ఆయన తెలిపారు .ఈ సమావేశంలో యువజన విభాగం నాయకులు బొశెట్టి రవి, తురక రామకోటి , గుర్రం సృజన్ ,అన దేవరశివ ,మణుగూరుటిఆర్ఎస్వి నాయకులు తాళ్లపల్లి రాహుల్ గౌడ్ ,చరణ్,అశోక్ ,నరేష్,శ్రీను, శివ లింగాపురం యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: