సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సింగరేణి ఉద్యోగుల వయో పరిమితి పెంపు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడం పట్ల మణుగూరు టిబిజికేయస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కోల్ ఇండియా లో లేనటువంటి అనేక హక్కులు,సంక్షేమం,అభివృద్ధి టిబిజికేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల. కవిత చొరవతో సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం లో సింగరేణి లో టిబిజికేయస్ ఇప్పటికే సాధించి కార్మికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని,వయో పరిమితి పెంపు టిబిజికేయస్ సాధించి పెట్టిన హక్కులలో మరో కలికితు రాయి గా నిలవబోతుండడం పట్ల మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు హర్షం వ్యక్తం చేశారు. టిబిజికేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల.కవిత అదేశానుసారంగా ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్యెల్యే బాల్క సుమన్,పెద్దపల్లి యంపి వెంకటేష్, నేతృత్వంలో శుక్రవారం నాడు టిబిజికేయస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల. రాజిరెడ్డి,కేంగర్ల.మల్లయ్య,ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలసి కార్మికుల వయో పరిమితి 61 సంవత్సరాలు పెంపు ను కోరుతూ వినతిపత్రం అందించడం, అందుకు సీఎం కేసీఆర్, సానుకూలంగా స్పందించడం అభినందనీయమైన,హర్షించే విషయమన్నారు.కార్మిక సంక్షేమం వారి అభివృద్దే ఉచ్స్వాస,నిచ్వాసగా పనులు చేస్తున్న టిబిజికేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల.కవిత,ప్రభుత్వ విప్,ఎమ్యెల్యే బాల్క. సుమన్,ఎంపీ వెంకటేష్, టిబిజికేయస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల. రాజిరెడ్డి,కేంగర్ల.మల్లయ్య కు మణుగూరు టిబిజికేయస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: