మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 15):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల రెవెన్యూ కార్యాలయంకు ఆర్డీవో స్వర్ణలత విచ్చేసి, కార్యాలయ రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసిల్దార్ భద్రకాళి మరియు సిబ్బంది కు, పాత రికార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అని,సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో నెలకొల్పనున్న బృహత్ పల్లె ప్రకృతి వనంకు కావలసిన ప్రభుత్వ స్థలాన్ని ఎంపీడీవో-జి రేవతి, తహసీల్దార్-భద్రకాళి తో కలిసి పరిశీలించారు.
Post A Comment: