CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"పాల్వంచను ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ గా తీర్చిదిద్దడమే లక్ష్యం - శానిటరీ ఇన్స్పెక్టర్ వాణీకుమారి."

Share it:


మన్యం టీవి పాల్వంచ :-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి కుమారి సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ లో గల శ్రీ వెంకటేశ్వర వైన్స్,వెంకట సాయి కిరాణా మర్చంట్ లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిoచి వేరు వేరుగా జరిమానాలు విధించారు.వైన్ షాపుకు నాలుగు వేలు,కిరాణా షాపుకు రెండు వేలు చొప్పున జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా మీడియాతో వాణీ కుమారి మాట్లాడుతూ మార్కెట్ లో వాణిజ్య సముదాయాల్లో విరివిగ ప్లాస్టిక్ వాడుతున్న యజమానులను విడిచిపెట్టేది లేదని మొదటి తప్పుగా భావించి జరిమానాలతో విడిచి పెడుతున్నామని మరలా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే షాపుల లైసెన్స్ లను రద్దు చేసి శాశ్వతంగా మూసేస్తామని హెచ్చరించారు.పాల్వంచను మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: