గుండాల జూలై 9 (మన్యం మనుగడ) ట్రాక్టర్ పల్టీ పడి ఇరువురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన ఫోంబోయిన సమ్మక్క , ట్రాక్టర్ డ్రైవర్ సనప సాంబశివరావు ట్రాక్టర్ మందు కట్టల లోడుతో వెళ్తుంటే గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఇంజన్ పల్టీ కొట్టడం తో ఇరువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకో వచ్చి చికిత్సనందిస్తున్నారు
Post A Comment: