మన్యంటీవీ, అశ్వారావుపేట: వైద్యపరంగా ఎనలేని సేవలను అందిస్తున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. ప్రాణాలకు తెగించి కుటుంబాలను దూరం పెట్టి కరోనా పేషెంట్ లకు మీరు చేసే వైద్యం వెలకట్టలేనిది మిమ్మల్ని సత్కరించుకోవడం మా బాధ్యత అని పవన్ కళ్యాణ్ సేవాసమితి పేర్కొంది. జులై 1 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లను పవన్ కళ్యాణ్ సేవా సమితి శాలువాతో సత్కరించి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు, భాస్కర్, రమేష్, నాగబాబు, సాయి ,ప్రేమ్, అప్పారావు ,చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Post A Comment: