మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఊటుపల్లి(జానకీపురం) గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పల్లె ప్రగతి గ్రామ సభ సమావేశాన్ని, గ్రామ పంచాయతీ కార్యదర్శి-ఎమ్ సురేష్ ఆధ్వర్యంలో సర్పంచ్ వాడే వెంకటమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఈ పల్లె ప్రగతి పది రోజుల ప్రణాళిక సమావేశంలో, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా, ఏడో విడతలో అవెన్యూ ప్లాంటేషన్ లలో ఇతర ఖాళీ ప్రదేశాలలో పది వేల మొక్కలు నాటడం.ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ, పారిశుద్ధ్యం పనులు, గ్రామ మౌళిక సదుపాయాలు, విద్యుత్ కు సంబంధించిన అంశాలు, ఆరోగ్యం,ఇతర సమస్యల గురించి చర్చించి తీర్మానించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్-ఉప్పతల శ్రీను, కో ఆప్షన్ నెంబర్- పోట్రు వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్- సంధ్యారాణి(ఎఈఓ), వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, సమావేశంలో పాల్గొన్నారు.
Post A Comment: