చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
ఆదివారం హుజూర్ నగర్ లో నిర్వహించిన పబ్లిక్ డిబేట్ కార్యక్రమంలో విలేఖరుల పై జరిగిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన చండ్రుగొండ మండల పెన్ ప్రెస్ క్లబ్ విలేఖరులు. ఈ సందర్భంగా పెన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాఫర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న సమస్యలు ఏత్తిచూపుతున్న విలేఖరుల పై దాడులు హేయమైన చర్య అని ఇటువంటి దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని దాడులు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది.ఈ కార్యక్రమంలో జాఫర్, కుంజా వెంకటేష్, కంచర్ల కృష్ణ ప్రసాద్, పూసం రాంబాబు,గణేష్, శివా, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: