CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజలు నిరంకుశ ప్రభుత్వాలకు చరమ గీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతారు

Share it:



ఎస్సి సెల్ మండల నాయకుడు ఎంపెళ్లి సమ్మయ్య

మన్యం టీవీ మంగపేట.


రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల ఎస్సి సెల్ నాయకుడు ఎంపెళ్లి సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ నిజాం నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడంలో, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో, ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని అన్నారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 50 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని సమ్మయ్య డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: