CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలోని రెండవ వార్డు లో నడిరోడ్డుపై కంకర కుప్పగా పోవడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.రాత్రి సమయాలలో సైకిల్ పై వచ్చేవారు.ఆ కంకర కుప్పను గమనించకుండా కింద పడి దెబ్బలు తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ కంకర కుప్ప గత రెండు నెలలుగా నడి వీధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శి మాత్రం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని,ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నాడని ఆ వార్డులో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పంచాయతీ ఇంకేంటి చెత్త సేకరణ ఆ వార్డులో నిర్వహించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇకనైనా పంచాయతీ కార్యదర్శి తక్షణమే స్పందించి గ్రామంలోని రోడ్లపై ఇటువంటి కంకర,ఇసుక నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share it:

Post A Comment: