👉గోదావరి వరదల్లో కొట్టుకపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
👉తక్షణమే వైద్య సేవలు
👉కళ్ళకు కట్టినట్లు గా మాక్ డ్రిల్
మన్యం మనుగడ,దుమ్ముగూడెం: గోదావరిలో వరద ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. ఆ ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు రక్షించండి రక్షించండి అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేస్తున్నారు. అప్పటికే అక్కడ అ వరద సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వరదల్లో కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను సిబ్బంది సురక్షితంగా రక్షించి వైద్య సేవలు అందించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని కొంతమంది వ్యక్తులు ఇది నిజమేనా అని అని ఆందోళన చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు వరద విపత్తుల బృందం శనివారం మాక్ డ్రిల్ నిర్వహించింది. అక్కడ వారు చేసిన కార్యక్రమాలుఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గోదావరి లో ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి అయినా తమ బృందం సిద్ధంగా ఉందని ...ఇది మాక్ డ్రిల్ల్ అని విపత్తుల బృందానికి సంబంధించిన అధికారి మన్యం టీవీ కి తెలిపారు.
Post A Comment: