మన్యం టీవీ ఏటూరు నాగారం
తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు వాజేడు, వెంకటాపురం మండలంలోని ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆదివాసి ప్రజలకు రాజ్యంగా చట్టాలు వారి అభివృద్ధికి ఐటీడీఏ కార్యాలయాలు తోడ్పాటును అందించాలి.కానీ ఆదివాసి చట్టాలను నిర్వీర్యం చేస్తూ అభివృద్ధికి నోచుకోకుండా అధికారులు పట్టించుకోవడం లేదు,అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఐటీడీఏ పీవో (జనరల్) వసంతరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వట్టం ఉపేందర్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి,హరితహారం పేరుతో ప్రభుత్వం,ఫారెస్ట్ అధికారులు బలవంతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిలిపి వేయాలని, కందకాలు త్రావే ఆలోచనను విరమింప చేసుకోవాలని అన్నారు. హక్కు పత్రాలు ఉన్న వాటిల్లో కూడా బలవంతంగా మొక్కలు నాటే ప్రయత్నం లో వారిని అక్రమ కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారని అక్రమ దాడులు చేస్తున్న ప్రభుత్వం,ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని,అధికారులకు రైతులకు మధ్య సమన్వయం మీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సాగు భూములకు రైతుబంధు ఇప్పించాలని వివిధ మండలాల నుండి రైతుల సమక్షంలో మెమోరండం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు జానకిరామ్, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు గొంది నగేష్, తుడుందెబ్బ నాయకులు ఎట్టి రాజబాబు, చింత సోమరాజు, కనితి వెంకటకృష్ణ, గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ముద్ద బోయిన రవి, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: