మన్యం టీవీ ఏటూరునాగారం
ములుగు ఎంపీడీవో కార్యాలయం నందు స్థానిక ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ తో కలిసి 20 మంది లబ్ధిదారులకు15,01740/ విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసినారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధి దారులు ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ కరుణ వలన ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయి అభివృద్ధి ఆగిపోయిన పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అందించడం జరుగుతుందని అన్నారు. దళిత బంధు పేరుతో దళిత కుటుంబాలలో అభివృద్ధి బాటలు వేయాలి జీవితాల్లో వెలుగులు నింపాలి అనే మంచి లక్ష్యంతో రాష్ట్రం లోనే దళితులకు కొత్త పథకం రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేశారని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: