మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజషన్ ముఖ్య సభ్యులు వనమా అనిల్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు బూర్గంపహాడ్,సారపాక,భద్రాచలం,దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాలలో ఉంటున్న యాచకులు,మతిస్థిమితం లేనివారు,విక లాంగులు, 75 మందికి వనమా అనిల్ ద్వారా,పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజషన్ సభ్యుల ఆధ్వర్యంలో భోజనాలు అందించడం జరిగింది. ఈ సందర్బంగా పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజషన్ సభ్యులు అనిల్ కి ధన్యవాదములు తెలిపారు,.అనిల్ గతం లో కూడా చాలా సేవ కార్యక్రమాలు చేసాడని,ముందు ముందు కూడా సేవ కార్యక్రమాలు చేయాలన్నారు ఈ కార్యక్రమం లో పృథ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజషన్ ఫౌండర్ బొల్లి పృథ్వి రాజ్ ,కన్వీనర్ కుమ్మరికుంట సాంబశివరావు, ఆర్మీ సభ్యులు, వీరేంద్ర, శ్రీకాంత్, బొల్లి శ్రీపతి, నాగేంద్ర, సాయి కిరణ్, పిడుగు అజయ్, గుణ, బొల్లి మనోజ్, బూడిద ప్రసాద్,పవన్, అక్సర్, నరేష్ పాల్గొన్నారు.
Post A Comment: