CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఏడూళ్ల బయ్యారం పంచాయతీలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా గల పిచ్చి మొక్కలను మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, సర్పంచ్ కోరం రజిని, సెక్రటరీ హరీష్ లతో కలిసి తొలగించడం జరిగింది. అనంతరం పొట్లపల్లి పంచాయితీలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని, పోట్ల పల్లి పంచాయతీ లో గల గడ్డి గూడెం గ్రామంలో ఎన్నాళ్ళ నుండో గ్రామ వాసులను డ్రైనేజీ సమస్య వేధిస్తుంది. సర్పంచ్ తోలెం కళ్యాణి తో గడ్డి గూడెం వెళ్ళిన ఎంపీపీ గుమ్మడి గాంధీ అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. చిన్న వర్షం పడిన నీరు నిలువ ఉండి అంతర్గత రహదారులకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది గమనించిన ఎంపీపీ వెంటనే సర్పంచ్ కు డ్రైనేజీ సమస్య కు పరిష్కారం చూపించాలని తెలియజేయడం జరిగింది. సర్పంచ్ వెంటనే ఫోన్ చేయగా కాసేపట్లోనే జెసిబి యంత్రము అక్కడికి చేరుకొని డ్రైనేజీ కి సంబంధించిన పనులను ప్రారంభించడం జరిగింది. కొన్ని ఉద్రిక్తతల నడుమ, డ్రైనేజీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎం పీ ఓ సునీల్ శర్మ, పంచాయతీ సెక్రటరీ సావిత్రి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: