మన్యం టీవీ, అశ్వాపురం:మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి వేడుకలు అశ్వాపురం మండలం లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మ గారి పల్లి గ్రామంలోని వైయస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించి మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం జగ్గారం లోని ఆరిఫా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు, పళ్ళు, రొట్టెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ హయాంలోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని ఎన్నో సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్,రైతు రుణమాఫీ,ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. అందుకే ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా స్థానం పెంచుకున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు వై వి పురుషోత్తం, మారం రమేష్, సోమేశ్ గౌడ్, వెంకన్న,వైయస్సార్ అభిమానులు నేలపట్ల వెంకటరామిరెడ్డి, సాంబిరెడ్డి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: