మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి గ్రామ సభను సర్పంచ్ కట్రం మోహనరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్రం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై చర్చించారు. మొక్కలు నాటించడం సంరక్షణ అంశాలపై చర్చించారు. గ్రామంలో అంతర్గత రహదారుల లో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే రోడ్లపై మట్టి తొలించాలని, డ్రైనేజీ లలో పూడిక తీయించి చాలని, రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు తొలగించాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ వైర్లు, లూజ్ ప్యానెల్ మరమ్మతులు చేయించాలని, మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతులు చేయించాలని, తీర్మానించారు. ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్య రవి, పాలకవర్గ సభ్యులు కాజా రమేష్, ఇన్ చార్జీ్ కార్యదర్శి షర్మిల, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణవేణి, ఎన్ఆర్ఈజీఎస్ టి ఎ సుహాసిని, ఫారెస్ట్ ఎఫ్ బి ఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: