మన్యం టీవీ, అశ్వారావుపేట: జమ్మిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఇంచార్జ్ సర్పంచ్ పెన్నాడ సూర్య ప్రభ అధ్యక్షతన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగినిది. గ్రామ సభలో గ్రామం లో వున్నా అనేక సమస్యలను కార్యదర్శి స్పందన ప్రజలను తెలుసుకొని రాసుకోవడం జరిగింది, ఇంకా 10 రోజులు వరుకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మీ యొక్క సమస్యలు తేలజేయవచని ఆమె తెలిపారు. పంచాయితీ యొక్క నిధులు నెల నెల ఎ విధంగా ఖర్చు చేస్తున్నారో కచ్చితంగా నోటీసు బోర్డుపై పెట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చెయ్యండి జరిగింది. దానికి సమాధానంగా ఇప్పిటి నుండి కచ్చితంగా నోటీసు బోర్డు పెడతామనీ కార్యదర్శి తెలిపారు. గ్రామం లో మురికి నీరు పోవడానికి నిర్మించిన డ్రైనేజికి మూతలు ఏర్పాటు చెయ్యాలని యువకులు కోరగా, అది పంచాయితీ పరిధిలోకి రాదనీ అది ఎంపీపీ, ఏంఎల్ఎ పరిధిలోకి వస్తుందని కార్యదర్శి అనడంతో యువకులు దీనికి సంబందించిన అధికారులు ఎవ్వరో ఈ సమస్య తీర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్యవేణి మరియు సెక్రెటరీ స్పందన, వార్డ్ మెంబర్ జగపతి, గుమస్తా వెంకన్న, పెన్నాడ ఏసు, యువకులు చిరంజీవి, జి సాయి, రాజేంద్ర, లక్ష్మినారాయణ, ఆర్ సాయి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: