ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం మనుగడ,పినపాక: పినపాక మండల వ్యాప్తంగా 4వవిడత పల్లె ప్రగతి లో అన్ని పంచాయతీ లో నిర్వహించిన పాదయాత్రలో లో భాగంగా గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆయన గురువారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో 4వ విడత పల్లె ప్రగతి గ్రామ సభ జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందన్నారు .పల్లె ప్రగతి మూలంగా పనులు గుర్తించడంతో పాటు అవి సకాలంలో పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రశేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ పినపాక స్పెషల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు పినపాక ఎంపీడీవో శ్రీనివాసులు, అంగన్ వాడి టీచర్స్, ఆశా వర్కర్స్ ,మరియు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగినది
Post A Comment: