మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వాలు పూర్తి చేసి తెరాస పార్టీ మంగపేట ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి కి అందజేయడం జరిగింది.
మల్లారెడ్డి మాట్లాడుతూ సభ్యత్వాలు త్వరగా పూర్తి చేసినందుకు పార్టీ నాయకులకు అభినంధనలు తెలియజేసినారు.
ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ ఇన్సూరెన్స్ చేపించి ఆన్లైన్ లో చూపించడం జరుగుతుంది. 2 లక్షల ప్రమాద బీమా ఇన్సురెన్స్ వల్ల కార్యకర్త కుటుంబం రోడ్డున పడకుండా పార్టీ కాపాడుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఒక్క తెరాస పార్టీకే సంభవం. దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి ఇంతటి సభ్యత్వం లేదు.
తెరాస పార్టీ సభ్యత్వం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
తెరాస పార్టీ కార్యకర్తలు అందరుకుడా ఎటువంటి గ్రూపులు కట్టకుండా మనం అంతా శ్రీ కేసీఆర్ నాయకత్వం లో పని చేయాలని ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ,మైనార్టీ మండల అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, ఎ స్సీ సెల్ మండల అధ్యక్షులు పూసల నరసింహారావు, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బట్ట నర్సింహారావు ,మండల యూత్ నాయకులు కన్నా సంపత్, కట్టుకోజు ప్రశాంత్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: