మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం,ఎంపీటీసీ చింతపంటి సత్యం ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పినపాక యువత నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఎం పి టి సి డాక్టర్ సత్యం ఆధ్వర్యంలో యువత సమక్షంలో పినపాక యూత్ అడ్డ వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనీ మొక్కలు నాటాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక యువత పాల్గొన్నారు..
Post A Comment: