-యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రీ నాగేంద్రబాబు
మన్యం మంగపేట.
రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కర్రీ నాగేంద్రబాబు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏఐసీసీ మహిళ ప్రధానకార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కని పోలీస్ అధికారి అయిన డీసీపీ రక్షిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కావాలనే అవమానించారని పోలీసుల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Post A Comment: