మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో కరోనా బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులను దాతల సహకారంతో ఏజెన్సీ దళితుల సేవా సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలకు ఉపాధి లేక ఎంతో బాధపడుచున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డు ఉన్న వారికి నిత్యావసర వస్తువులను 5000/ రూపాయలను ప్రభుత్వం ఇచ్చి నిరు పేద కుటుంబాలను ఆదుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ ప్రభుత్వని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గాజర్ల రాజు,వంకాల సత్యం, మలేపాక శ్రీను,కరోన బాధిత కుటుంబాల వారు పాల్గొన్నారు.
Post A Comment: