CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నిబంధనలను తుంగలో తొక్కారు...

Share it:

 


బాధ్యత రహితంగా వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు...



మన్యం టీవీ : జూలూరుపాడు,      భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో కరోనా నిబంధనలను తుంగలో తొక్కి వేస్తూ  ఎవరికి వారు ఇష్టారీతిగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. కరోనా భారీ నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా చర్యలు చేపడుతోంది , లాక్ డౌన్ విధించి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తోంది ,పోలీసు యంత్రాంగం సైతం మిట్టమధ్యాహ్నం మండుటెండను సైతం తమ ప్రాణాలు పణంగా పెట్టి మండలంలోని గ్రామ గ్రామాన, వీధి వీధినా నిరంతరం గస్తీ కాస్తున్నారు . ఆరోగ్యశాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్న, అయినా సరే ప్రజలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు .ఈ నేపథ్యంలో జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం చెరువులో గత రెండు రోజులుగా చేపల వేట కొనసాగుతోంది. నేడు ఆదివారం కావడంతో ఉదయం 6 గంటల సమయానికి వందలాదిమంది చుట్టుపక్కల గ్రామాల వారు చేపల కోసం చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపులు గుంపులుగా చేరి చేపల కోసం ఎగబడిన కనీసం పట్టించుకున్న వారే లేకపోయారు .మన అధికారయంత్రాంగం, ఆరోగ్యశాఖ ,పోలీసులు ,నిరంతరం కష్టపడి పని చేస్తున్నా కొందరి  నిర్లక్ష్యం వల్ల అధికార యంత్రాంగం మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Share it:

TELANGANA

Post A Comment: