CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మృతులకు అంతిమయాత్ర బంధువులు వీరు...

Share it:

 


కుల మతాలకు అతీత సమాజ సేవకులు మీరు...



మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో ప్రాణాలకు తెగించి జాతి, కులం, మతం, అనే తారతమ్యం లేకుండా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమాజ సేవకులు జూలూరుపాడు మండల సిపిఐ యువ నాయకులు షేక్ నాగుల్ మీరా, అతని మిత్ర బృందం, పగడాల అఖిల్, పసుపులేటి పవన్, షేక్ సమీరా, లకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నకంటి వీరభద్రం , కాకర్ల ఎం పి టి సి పొన్నికంటి సతీష్ కుమార్, లు ఆదివారం కాకర్ల గ్రామం లో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .కరోనా బారినపడి మృతిచెందిన వారి మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీసం కుటుంబ సభ్యులే ధైర్యం చేయలేకపోతున్న తరుణంలో ధైర్యంగా తాము ఉన్నామని ముందుకు వచ్చి ఆ కుటుంబాలకు పెద్దదిక్కుగా నిలిచి అంత్యక్రియలు నిర్వహిస్తున్నా నాగుల్ మీరా బృందాన్ని ,ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జూలూరుపాడు మండలం లో ఇటువంటి సేవకులు ఉండటం గర్వంగా ఉందన్నారు , వారు చేస్తున్న సేవలకు గుర్తుగా చిరు సత్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు .నాగుల్ మీరా బృందం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందాలని వారు అభిప్రాయపడ్డారు. ఆదర్శంగా తీసుకొని మండలంలోని మరింత మంది యువత ముందుకు రావాలని అని వారు ఆకాంక్షించారు.

Share it:

TELANGANA

Post A Comment: