CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనుమతి లేని మిర్చి విత్తనాలను పట్టుకొని సీజ్ చేసిన అధికారులు...

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని గానుగపాడు గ్రామంలోని జావలి సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపులో సరైన అనుమతులేని హైదరాబాద్ డెక్కన్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలను విక్రయిస్తున్నారని పక్క సమాచారం మేరకు ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు షాపులో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేని డెక్కన్ కంపెనీ కి చెందిన 1 లక్ష రూపాయల విలువ చేసే మిర్చి విత్తనాల ప్యాకెట్లను పట్టుకొని సీజ్ చేసారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఏ శ్రీకాంత్ మాట్లాడుతూ. ఖరీఫ్ సీజన్లో వివిధ కంపెనీలకు చెందిన పత్తి మిర్చి విత్తనాలు ఫెర్టిలైజర్ షాపుల్లో సరఫరా చేస్తూ ఉంటారు విత్తనాల కంపెనీలకు సరైన అనుమతులు ఉన్నాయా లేవా యజమానులు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అనుమతి లేని విత్తనాలు నకిలీ విత్తనాలు ఎవరైనా రైతులకు విక్రయించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డెక్కన్ కంపెనీ కి సంబంధించిన మిర్చి విత్తనాలు ఈ సంవత్సరం రెన్యువల్ చేయలేదని. కంపెనీవారు రెన్యువల్ చేయకుండా షాపుల వారికి విత్తనాలు పంపిణీ చేయడంతో వారు విత్తనాలు కొనుగోలు చేశారని. షాపు యజమాని కూడా ఎవరికీ విత్తనాలు అమ్మకుండా పూర్తిగా పోలీసువారికి సహకరించారు‌. ఇవి నకిలీ విత్తనాలు కావని. కేవలం ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడంతో వీటిని స్వాధీనం పరుచుకున్నాము. అనుమతులు రాగానే వారి విత్తనాలు వారికి అందజేస్తామన్నారు. రైతులు కూడా అధైర్య పడవద్దని ఇది కేవలం ఎంక్వైరియే అన్నారు.. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: