మన్యం మనుగడ , పినపాక: పినపాక మండలం లోని మల్లారం గ్రామ పంచాయతీ భవనంలో శనివారం రోజున సుమారు రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి మంటలను అదుపు చేయడం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అగ్ని ప్రమాదానికి కారకులై ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ తలుపులు బలమైన ఆయుధంతో తీసి లోపలకి వెళ్లి మంటలు అంటించి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయమై స్థానిక సర్పంచ్ కొమరం రాధాబాయిని వివరణ కోరగా, ప్రమాదానికి గల కారణం తెలియదని, పంచాయతీకి సంబంధించిన పరిపాలన, ఆర్థిక లావాదేవీల పత్రాలు జాగ్రత్తగానే ఉన్నాయని, పంచాయతీ భవనం లో గల కుర్చీలు, హైపోక్లోరైట్ ద్రావణము, ట్రీ గార్డ్స్, తోపుడు బండి మంటలకు ఆహుతి అయ్యాయని తెలియజేశారు.కొంతమంది వ్యక్తులు కావాలని పరిపాలన ఆర్థిక పరమైన పత్రాలు ధ్వంసం అయ్యాయి అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై పై అధికారులకు, ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని వివరణ ఇచ్చారు.
Post A Comment: