మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీ, నామవరం రెవెన్యూ పరిధిలోని పెద్దవాగులో ఎటువంటి అనుమతులు లేకుండా,అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను, గత రాత్రి స్థానికుల సమాచారం మేరకు అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ - జి పుల్లారావు , కానిస్టేబుల్ - బి కేశవ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్ది నెలలుగా సంబంధిత ట్రాక్టర్ యజమాని అక్రమంగా ఇసుకను బయటకు తరలిస్తూ,డబ్బులు దండుకుంటు, పంచాయతీ అభివృద్ధి పనులకు సైతం ఇసుక నిల్వలు లేకుండా ఇసుక మాఫియా చేస్తున్నాడని, అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, స్థానిక గిరిజనులు వాపోతున్నారు.
Post A Comment: