మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వాసవి సేవా ఫౌండేషన్ సేవలు గర్వకారణమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ అన్నారు. వాసవి క్లబ్ సౌజన్యంతో ఫౌండేషన్ ప్రతినిధి కాలిఫోర్నియాలోని ఎన్ఆర్ఐ జొన్నలగడ్డ ఉపేందర్ కుమార్ రూ. 3 లక్షల విలువైన 4 ఆక్సిజన్ యంత్రాలను ఇల్లందు పట్టణములోని ప్రభుత్వ వైద్యశాలకు ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. . పుట్టిన గడ్డపై మమకారంతో ఎన్ఆర్ఐ ఉపేందర్ కుమార్ చేసిన సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ వైద్యులు వరుణ్ కుమార్, మాధవరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు గౌరిశెట్టి కృష్ణ, నరేందర్, రవి, ఉపేంద్ర నాద్ గుప్తా, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: