మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట పట్టణం లోని మేజర్ గ్రామపంచాయితీ లో పనిచేస్తున్నటువంటి ఇరువై రెండు మంది కార్మికులకు ఎంపీటీసీ వేముల భారతి శనివారం బిర్యానీ స్వయంగా వండి పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎంపీటీసీ భారతి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా గత సంవత్సర కాలం నుండి వీరు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయని, ప్రాణాలకు తెగించి కరోనా వచ్చిన వారి వీధులను శుభ్రపరచడమే కాకుండా బాధ్యతగా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడం లో వీరి పాత్రను ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. అనంతరం కరోనా తో బాధపడుతున్న బాధితులు ఎవ్వరైనా భోజనవసతికి ఇబ్బంది పడినట్లు ఐతే 7095302949 కి కాల్ చేసి తెలియజేయవలసిందిగా భారతి తెలియజేసారు.
Post A Comment: