కరోనా చికిత్స పొందుతూనే బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ జయరాజ్
గత కొన్ని సంవత్సరాలుగా చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న జయరాజ్
గుండాల ( మన్యం టీవీ) మండలంలో తొలి బ్లాక్ ఫంగస్ కేస్ నమోదయింది మండల కేంద్రంలో ఏసుక్రీస్తు సమాజ మందిరం పాస్టర్ గా పనిచేస్తున్న బట్టు జయరాజ్ బ్లాక్ ఫంగస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. గత రెండు నెలల క్రితం జయరాజ్ పాస్టర్ కరోనా బారిన పడడంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనాకు చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతూనే బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురికావడంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో గత మూడు వారాలుగా బ్లాక్ ఫంగస్ కు చికిత్స పొందుతున్నారు. మండలంలో ఇప్పటివరకు చాలామంది కరోనాతో బాధపడి మృత్యువాత పడ్డారు పెద్ద మొత్తంలో కరోనా నుండి కూడా కోలుకున్నారు. కానీ కరోనాకు చికిత్స పొందుతూనే బ్లాక్ ఫంగస్ బారినపడిన తొలి వ్యక్తి జయరాజ్ కావడం గమన హారం ఇప్పటికే మండలంలో కరోనా కలవరం పెడుతుంటే కొత్త బ్లాక్ ఫంగస్ మూలాలు మండలంలో నమోదు కావడంతో మండల వాసులొ భయాందోళనలు మొదలయ్యాయి.
Post A Comment: