గుండాల /ఆళ్ల పల్లి ( మన్యం టీవీ) మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో సెంట్రల్ లైన్ తో ఆక్సిజన్ ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య అధికారిని సంధ్యారాణి పేర్కొన్నారు. దీనితోపాటు ప్రాథమిక వైద్యశాలకు 2 ఆక్సిజన్ సిలిండర్లను అందించారన్నారు ఒక దానిని మర్కోడు ఐసోలేషన్ కేంద్రంలో ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. చార్జి యూఎస్ఏ ఫౌండేషన్ వారి సహకారంతో 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అందించారని ఆమె అన్నారు. మొత్తం మీద కరుణ పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడవచ్చని ఆమె పేర్కొన్నారు
Post A Comment: