మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
భద్రాచలం లో ప్రముఖ న్యాయవాది పడిసిరి. శ్రీనివాసరావుకి రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం ఏ జి పి గా ఎంపిక చేసిన సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు సంఘ సేవకులు లయన్ గాదె మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టూరిజం హోటల్ నందు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏపీ పి & మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా దేవదానం గారు మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి వి కృష్ణమాచార్యులు గారు హాజరై ఘనంగా సన్మానించారు గాదె మాధవ రెడ్డి మాట్లాడుతూ పడిసిరి చాలాకాలం నాటి మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు నాటినుండి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇంత పెద్ద పోస్టు ఇవ్వడం చాలా సంతోషకరం అని అన్నారు అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తిత్వం అని వారు అభివర్ణించారు మరియు దేవదానం కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జూనియర్ లాయర్ గా ఎంతోమంది పేద ప్రజలకు న్యాయ వృత్తి లో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి బార్ అసోసియేషన్ లో ఎన్నో పదవులు అలంకరించి ఈనాడు ఏ జి పి గా ఎన్నికైనందుకు ఎంతో సంతోషమని ఆశీర్వదించారు ముందు ముందు ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలని ఎంతోమందికి ఆదర్శ వంతంగా నిలబడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు. టిడిపి నాయకులు ఎస్కే అజీమ్. జూనియర్ కాబోయే లాయర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: