👉మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
మన్యం మనుగడ ,అశ్వాపురం:
మొండికుంట గ్రామ పంచాయతీ లో హరితహారం క్రింద ఏవిన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటి ప్రారంభించిన సర్పంచ్ మర్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు మొక్కల పెంపకం పైనే ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముందుచూపుతో మొక్కల పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు .నాకు ఉప సర్పంచ్ సుదీర్, ఎంపీటీసీ నరేష్, పంచాయతీ లో ఏవిన్యూ ప్లాంటేషన్ క్రింద 1000 మొక్కలు నాటుతున్నాం,హోమ్ స్టెడ్ ద్వారా 5000 మొక్కలు, కమ్యూనిటీ 1000 మొక్కలు, ప్రకృతి వనం లో 3000 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ సైధులు, వార్డ్ మెంబెర్ ఉప్పలరెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: