మన్యం టీవీ చర్ల: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ, చర్ల ఏరియా కమిటీ కి అనుబంధంగా ఉంటివంటి మిలిషియాలో పని చేస్తున్న నలుగురు వ్యక్తులను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం సమయంలో బత్తినపల్లి- రామచంద్రపురం గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న చర్ల పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ 141 Bn 'A' Coy సిబ్బందికి వీరు తారసపడగా పోలీసు వారు వీరిని పట్టుకుని విచారించగా వారు నలుగురు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ మిలీషియాలో సభ్యులుగా పని చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. వీరు నలుగురు మరికొంత మంది మిలిషియా సభ్యులతో కలిసి మిలీషియా కమాండర్ అయిన వెట్టి దేవా @బాలు ఆధ్వర్యంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి పని చేస్తు, చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు విధ్వంసకర సంఘటనలలో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్, ఎస్సై వెంకటప్పయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: