మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలం లోని అమరారం పంచాయతీలో గల ఆదివాసి గ్రామం తిర్లాపురంలో, ఏడూళ్ల బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ల పంపిణీ చేయడం జరిగింది.గ్రామంలో మొత్తం 36 కుటుంబాలు ఉండగా ఇంటికొక వాటర్ ఫిల్టర్ ను అందజేయడం జరిగింది. అంతేకాకుండా అరటి పళ్ళు బిస్కెట్స్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ హాజరైనారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శబరీష్ మాట్లాడుతూ, ఆదివాసీ జీవన మనుగడ కోసం పోలీసు శాఖ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, ఆదివాసి గ్రామాల తరపున సమస్యలు ఏమైనా ఉంటే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. పోలీసు శాఖ చేసే సహాయ సహకారాల పట్ల ఋణపడి ఉంటామని, తిర్లాపురం గ్రామ పెద్ద నూపా రామయ్య, నూపా వాసు తదితరులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు
ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎస్సై టి వి ఆర్ సూరి , పోలీసు సిబ్బంది, తిర్లా పురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: